Get Mystery Box with random crypto!

Follow this link to join my WhatsApp group: https://chat.whats | 🔱 🕉️🙏🚩 *శివ భక్తులు - నాయనార్ల జీవిత చరిత్రలు - పెరియ పురాణం* 🔱 🕉️🙏🚩

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/BzsiHKut7dEHRFlDOxqg0X

మొదటి నుంచి కావాలంటే Telegram Group జాయిన్ అవ్వండి https://t.me/PeriyaPuranam

*శివ భక్తులు - నాయనార్ల జీవిత చరిత్రలు - పెరియ పురాణం*

*ఓం నమః శివాయ*
*60).కోచన్ గాట్ చోళ నాయనారు*

చోళ దేశంలో చంద్ర తీర్థముంది. చంద్రతీర్థములో ఒక చోట దట్టమైన పాద వుంది . ఆదట్టమైన పొద దగ్గర జంబూ వృక్షముంది .ఆజంబూ వృక్షము క్రింద శివలింగ ముంది . ప్రతిదినము ఒక తెల్ల ఏనుగు వచ్చి లింగము ముందు సాష్టాంగపడి అర్చించి వెళ్లేది . ఒక సాలీడు గూడ ఆ శివలింగమును పూజించేది . ప్రతిరోజూ ఆ లింగంపై ఎండు టాకులు పడుతుండుట చూచి ఆ ఆకులు పడకుండ సాలీడు శివలింగంపై తన గూడు ను అల్లింది.

మరుసటి రోజున పూజకు ఏనుగు వచ్చి చూస్తే దానిమీద సాలీడు గూడు చూచిం ది . ఎవరో ఆ లింగంను అపవిత్రము చేశారని భావించి ఆ సాలీడు గూడును తీసివేసి అర్చించి వెళ్లి పోయింది . తర్వాత సాలీడు వచ్చి చూస్తే తన గూడు కన్పించలేదు . తన గూడు పోయినందుకు విచారించి తిరిగి తన గూడును శివునిమీద రక్షణకు అల్లింది . మరుసటి దినమున ఏనుగు తన గూడును పాడుచేయు చుండుట చూచి సాలీడు ఏనుగును కుట్టింది.

ఏనుగు దాని విషంతో అక్కడి కక్కడే మరణించింది . సాలీడు గూడ ఏనుగు తొండం క్రింద పడి మరణించింది . శివానుగ్రహమువలన సాలీడు చోళరాజు సుబాదేవన్ కు కుమారుడుగా జన్మిం చింది . సుబాదేవన్ అతని సతీమణి చిదంబరము వెళ్లి నటరాజస్వామిని తమకు సంతతికై ఒక కుమారునికై అర్థించారు . పరమశివుడు వారిని అనుగ్రహించాడు . అతని సతీ మణి కోమలవతి గర్భం ధరించింది . కుమారుని కనేవేళ అయింది . జ్యోతిష్కులు కొన్ని క్షణాల తర్వాత ఆమె కనినచో త్రిభువనముల నేలు పుత్రుడు జన్మిస్తాడని చెప్పారు.

రాణి గారు - ఆమె పొట్టచుట్టూ గట్టిగా కట్టి తనను ఇంటిలోని చూరుకు తలక్రిందులుగా వ్రేలాడ తీయుడని ప్రార్థించింది . మంచివేళ అవగానే ఆమెను క్రిందికి దించి యధావిధిని పడుకోబెట్టారు . ఆమె పుత్రుని కన్నది . పుత్రుడు కొంచెం ఎక్కువ సేపు తల్లి గర్భంలోనున్నందున అతని కళ్లు ఎల్ల బడ్డా యి . తల్లి తన కుమారుని చూచుకొని కొచెకన్నానో (ఎఱ్ఱకళ్లపుత్రుడు) అని అంటూ ప్రాణం విడిచింది.

యుక్తవయసు రాగానే చోళరాజు ఆ పుత్రునికి పట్టము గట్టి తను అరణ్యాలకు పోయి తీవ్రముగా తపస్సు చేసి శివ సాయుజ్యమందాడు. కోచెన్ గాటు చోళుడు శైవమత వ్యాప్తికి ఇతోదికముగా కృషి చేశాడు . తిరుఅనైకా లో ఇది వరకు జంబూ వృక్షము క్రింద చక్కని దేవాలయమును కట్టి అందులో శివ లింగమును ప్రతిష్ట చేశాడు.

చోళనాడులో ఎన్నో శివాలయాలను మందిరాలను తిల్లెలో 3000 బ్రాహ్మణులకు నిర్మించి యిచ్చాడు . చిదంబరంలో నిత్యార్చనకై కట్టు దిట్టమైన ఏర్పాటు చేశాడు . అంత్యమున శివసాయుజ్యమందినాడు . పోయ్ గయార్ తనరచనలలో కలవాజినారపత్తు లో కోచెన్ గాట్ చోళ నాయనారును పద్యాలలో శ్లాఘించాడు . ఈయన చరితము కొంచెము శ్రీకాళహస్తి చరితమును పోలి వుంటుంది.